Eto Vellipoyindhi Manasu : భార్య పుట్టింటికి వెళ్ళిన భర్త.. ప్రేయసి రిక్వెస్ట్ తో అక్కడికి!
on Oct 22, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -232 లో.....రామలక్ష్మి తన పుట్టింటికి వెళదామని అనడంతో సీతాకాంత్ త్వరగా ఇంటికి వస్తాడు. అప్పుడే రామలక్ష్మి, శ్రీలత ఇద్దరు ఆర్గుమెంట్ చేసుకుంటారు. మీరు పదండీ వెళ్లి త్వరగా రెడీ అవ్వండి అంటు సీతాకాంత్ ని పైకి తీసుకొని వెళ్తుంది రామలక్ష్మి. ఆ తర్వాత రామలక్ష్మి బట్టలు సర్దుతుంది. సూట్ కేసు తనకి పెట్టడం రాకపోతే సీతాకాంత్ వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటుంటారు. రామలక్ష్మి సీతాకాంత్ లు తలలు డాష్ ఇచ్చుకోవడంతో కొమ్ములు వస్తాయని రామలక్ష్మి అనగానే మళ్ళీ డాష్ ఇస్తాడు.
మరొకవైపు సీతాకాంత్ పై ప్రేమతో తన ఇంటికి తీసుకొని వెళ్ళింది రామలక్ష్మి. పూర్తిగా సీతాకాంత్ ని ఇక తనకి వైపుకి తిప్పుకుంటుందని నందినితో హారిక అంటుంది. అలా ఎప్పుడు జరగదు. నేను వాళ్ళని విడగొడతానని నందిని అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి వాళ్లు తన పుట్టింటికి వస్తారు. సీతాకాంత్, సిరి లు కూడా వస్తారు. వాళ్ళని సుజాత, మాణిక్యంలు అహ్వానిస్తారు. మాణిక్యం పై సీతాకాంత్ కాస్త కోపంగానే ఉండటంతో.. తనకి దూరంగానే ఉంటాడు మాణిక్యం.
ఆ తర్వాత సీతాకాంత్ కి నందిని ఫోన్ చేసి ఆఫీస్ కి రమ్మని చెప్తుంది. ఇప్పుడు వీలు అవ్వదని సీతాకాంత్ చెప్తాడు. అయిన కూడా నందిని వదలదు.. ఫారేనర్ తో మీటింగ్ ఉంది.. అది ఓకే అయితే కంపెనీ కి చాలా బెన్ఫిట్ అని నందిని అంటుంది. దాంతో సీతాకాంత్ సరే అంటాడు. అదే విషయం రామలక్ష్మి వాళ్లకి సీతాకాంత్ చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత మీటింగ్ నందిని ఇంట్లో జరుగుతుంది. అందరం డిన్నర్ చేద్దామని నందిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read